Perni Nani Shocking : మాజీ మంత్రి పేర్ని నాని పై భగ్గుమన్న మచిలీపట్నం కోర్టు

ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు...

Hello Telugu -Perni Nani

Hello Telugu -Perni Nani

Perni Nani : మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కీలక నాయకుడు పేర్ని నానికి మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2019లో తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు చందు, శ్రీహర్షలపై ఏపీ పోలీస్‌శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసులో పేర్ని నాని సాక్షిగా ఉన్నారు.

Machilipatnam Court Slams Perni Nani

కోర్టు ఇప్పటికే పలు మార్లు విచారణకు హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ చేసింది. కానీ నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. విచారణకు గైర్హాజరైన కారణంగా మచిలీపట్నం కోర్టు ఆయనపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

కోర్టు తదుపరి విచారణను సెప్టెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. అదే సమయంలో, ఆ రోజున కోర్టులో పేర్ని నానిని హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది, ఎందుకంటే పేర్ని నాని గతంలో కీలక మంత్రిగా ఉన్నారు.

Also Read : CM Chandrababu- Popular SERP : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’ పై కీలక ట్వీట్

Exit mobile version