Stock Market : పశ్చిమాసియాలో పరిస్థితులు శాంతించడంతో భారత స్టాక్ మార్కెట్లు బుధవారం రోజున గట్టి లాభాలను నమోదు చేశాయి. ఇరాన్ – ఇజ్రాయెల్ (Israel) మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో అంతర్జాతీయంగా మూడ్ మెరుగుపడటమే ఇందుకు ప్రధాన కారణం. అంతేకాకుండా, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం కూడా మార్కెట్లకు సానుకూల ప్రభావాన్ని చూపింది.
Stock Market Sensational Updates
ఈ అనుకూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు ఉదయం నుంచే లాభాల్లో కదలాడాయి. మంగళవారం ముగింపు (82,055)తో పోలిస్తే, బుధవారం ఉదయం సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ప్రారంభించింది. మధ్యాహ్నం తర్వాత ఈ లాభాలు మరింత పెరిగి, ఇంట్రాడే గరిష్టంగా 82,815 వద్దకు చేరుకుంది. చివరికి సెన్సెక్స్ 700 పాయింట్ల లాభంతో 82,755 వద్ద రోజును ముగించింది.
ఇక నిఫ్టీ కూడా అదే ధోరణిలో కదలింది. చివరికి 200 పాయింట్ల లాభంతో 25,244 వద్ద ముగిసింది. మళ్లీ 25,200 మార్కును తిరిగి అధిగమించడం విశేషం.
లాభాల్లో ముగిసిన షేర్లు:
ఎమ్సీఎక్స్ ఇండియా, బిర్లాసాఫ్ట్, పేజ్ ఇండస్ట్రీస్, హెచ్ఎఫ్సీఎల్ షేర్లు దూసుకెళ్లాయి.
నష్టాల్లో ముగిసినవి:
ఎంజెల్ వన్, భారత్ ఎలక్ట్రానిక్స్, మాజగాన్ డాక్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు కొంత మేర వెనక్కి వెళ్లాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 259 పాయింట్ల లాభంతో, బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్ల ఎగబాకింది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹86.08గా నమోదైంది.
ఇక ముందు కొన్ని రోజులు కూడా మార్కెట్లు ఈ సానుకూల దిశలోనే సాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Also Read : Tesla New Innovation : భారత్ లోని ప్రధాన నగరాల్లో టెస్లా విక్రయ కేంద్రాలు
